కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలకు పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ కార్తీక పౌర్ణమి సోమ వారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరుల గుడి ఆవర ణలో ఉన్న పోతురాజుకు పూలమాల వేశారు. ఉత్స వాలు పూర్తయ్యే వరకు గుడిని వీడి వెళ్లవద్దని పోతురాజుకు 101 పోగులతో ఆనకట్టు కట్టే ప్రక్రియ నిర్వహించారు. మొదట చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరో ఏడు వీరుల ఆయుధా శుభ్రపరిచిన అనంతరం అలం కారాలు చేసి గ్రామోత్సవం చేశారు. అంకాళమ్మ గుడి ముఖ ద్వారానికి ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం గుండా వీరుల ఆయు ధాలను గుడిలోకి తీసుకెళ్లారు. అనంతరం చెన్నకేశస్వామికి పూజలు చేసి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీరంగం వేశారు. అనంతరం పీఠాధిపతితో కలసి వీరులగుడికి చేరుకుని బ్రహ్మనాయుడు నృరసింహకుంతాన్ని పోతు రాజుకు అభిముఖంగా ఉంచి పడిగెం కట్టారు. 28 నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు ఈ ప్రక్రియతో ఉత్సవాల నిర్వహణ సన్నా హాలకు శ్రీకారం చుట్టామని, ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్నాటి వీరాచార, వీర విద్యావంతులకు వర్త మానాలు పంపుతామని పీఠాధిపతి చెప్పారు. ఉత్సవాలు కార్తీక అమావాస్య నవంబరు 28 నుంచి ఐదు రోజులపాటు జరుగుతాయని తెలిపారు. 28న రాచగావు. 29న రాయబారం, 30న మందపోరు(బ్రహ్మనాయుడు చాప కూడు సిద్దాంతం అమలు), డిసెంబరు 1న కోడిపోరు, 2న కళ్లిపాడు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
పల్నాటి వీరారాధన ఉత్సవాలకుశ్రీకారం
